GET MORE DETAILS

జన విజ్ఞాన వేదిక నాయకుడు జంపా కృష్ణ కిషోర్‌ కన్నుమూత

 జన విజ్ఞాన వేదిక నాయకుడు జంపా కృష్ణ కిషోర్‌ కన్నుమూత



జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జంపా కృష్ణ కిషోర్‌(65) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు.

1988 సంవత్సరం నుంచి జన విజ్ఞాన వేదికలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ సభ్యుడిగా, విజయవాడ ఫిల్మ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ సేవలందించారు. శాస్త్ర విజ్ఞాన వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. ఆయన పార్థివదేహాన్ని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి దానం చేస్తున్నట్లు కుమార్తె అరుణ తెలిపారు.

Post a Comment

0 Comments