GET MORE DETAILS

నీరసం తగ్గించే నేరేడు పండు

 నీరసం తగ్గించే నేరేడు పండు



నేరేడుపండ్లు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. నిగనిగలాడుతూ, నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...!

1️⃣ నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీ షియం, ఫాస్పరస్, సోడియం, విటమిన్ సి, థయామిన్, ఫోలిక్ యాసిడ్, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి.

2️⃣ ధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు 2 ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇందులోని పోషకాలు గ్లైస మిక్ ఇండెక్స్ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపు తాయి. రక్తశుద్ధి జరుగుతుంది.

3️⃣ క్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ 3 పండును ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.

4️⃣ వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం 4 ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

5️⃣ చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరి యాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

6️⃣ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకో వడం వల్ల విటమిన్ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

7️⃣ నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్ప నిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించు కున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.

Post a Comment

0 Comments