GET MORE DETAILS

శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు 2024

శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు 2024



2024-25 శ్రీ ‘క్రోధి’ నామ సంవత్సరంలో వృషభరాశి వారికి అన్నింటా విజయాలే..! కానీ ఆ ఒక్క విషయంలో 2024-25 హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇదే సమయంలో ఉగాది పండుగను జరుపుకోనున్నాం. తెలుగు వారి 60 సంవత్సరాల్లో ఇది 38వది. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, గురుడు, శని శుభ స్థానాల్లో ఉండటం వల్ల వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో అనుకూలంగా ఉంటుది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చేసే కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, విద్యా, కెరీర్ పరంగా, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాదిలో ఏప్రిల్ తర్వాత వృషభరాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా విజయం సాధిస్తారు. పంచమ స్థానంలో రాహువు, కేతువులు ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. శని దేవుడు కూడా శుభ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజ పూజ్యం-7, అవమానం-3గా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు ఏడో స్థానంలో, శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యా రంగంలో పురోగతిని సాధిస్తారు.వృషభరాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలొస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

వృషభ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు కోరుకున్న చోటుకి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ జాబ్ పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది.వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి. 

ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజ పూజ్యం-7, అవమానం-3గా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు ఏడో స్థానంలో, శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యా రంగంలో పురోగతిని సాధిస్తారు.వృషభ రాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడొచ్చు. ఏప్రిల్ తర్వాత తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం, దినచర్యలో మార్పులు చేసుకోవడంతో ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో ఏప్రిల్ తర్వాత కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ ఏడాది మీ భాగస్వామితో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది.ఈ రాశి వారు ఉగాది నుంచి క్రమం తప్పకుండా గురు మంత్రం జపించాలి.

• ఈ ఏడాది పది ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మేలు జరుగుతుంది.

• ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

• ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి.

• ప్రతిరోజూ ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Post a Comment

0 Comments