మాఘపురాణం : 7వ అధ్యాయము - లోభికి మాఘమాస స్నాన ఫలము
లోభికి మాఘమాస స్తాన ఫలితం ఉందా?అని ప్రశ్నిస్తాడు
కథ ఒక ధనవంతుడు, ఎప్పుడూ దానం చేయకుండా, కేవలం డబ్బు కూడబెట్టే లోభి గురించి చెబుతుంది.
మాఘమాస స్నానం పుణ్యమని తెలుసుకున్నా, లోభం వల్ల ఎవరికీ దానం చేయకుండానే స్నానం చేస్తాడు. కానీ, అతనికి ఎటువంటి పుణ్యం లభించలేదు. చివరికి, లోభం వల్లే పుణ్యం పొందలేకపోయాడని గ్రహిస్తాడు. మనం లోభిత మనసుతో చేసే పనులకు ఫలితాలుండవని, దానం, సహాయం ద్వారానే పుణ్యం పొందగలమని ఈ కథ బోధిస్తుంది.
వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇలా తెలియజేసెను.. “పార్వతీ! చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమునందు అసంత వాడయను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడు ఒకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుట గాని దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతే కాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు అన్నియూ స్వాధీన పరచుకొనేవాడు.
ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, “తల్లీ! నేను ముసలి వాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు దూరం వెళ్ళవలసి యున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతు ఉన్నాయి. చలి గాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము, నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను” అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలి కలిగెను, వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి, అందొక తుంగ చాప వేసి, కప్పుకొనుటకు వస్త్రము ఇచ్చి పడుకొనమని పలికెను. ఆమె దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, “ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది” అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, “అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని లేక నూతి యందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళముతోను, పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించి, తరువాత మాఘ పురాణము పఠించవలెను.
ఇలా ప్రతి దినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెల రోజులూ చేయలేని వారూ, వృద్దులూ, రోగులు ఒక్క రోజు అయినను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడుగాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపము వచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పట పటాకొరికి “ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానము చేసి, పూజలు చేసి, దానములు చేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని ‘భిక్షాందేహీ’ అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పడుకో”, అని కోపంగా కసిరాడు.
ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది, తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈ లోగా బంగారుశెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగు లాడిరి అటుల మునుగుట చే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు.
కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ* *చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొని పోవుటకు యమ భటులు వచ్చి కాల పాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని* *తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.
“ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా” అని వారి నుద్దేశించి అడుగగా, "ఓ అమ్మా! నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమ లోకమునకు తీసుకొని పోవుచున్నాము” అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. “నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలుగెను?” అని అనగా
ఆ యమ భటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాప పుణ్యముల పట్టిక చూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను.
విష్ణు లోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి.
“రాజా! వింటివా! భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసిని గొట్టుగా వ్యవహరించినను భార్యా యధా లాపముగా మాఘమాస స్నానము చేసినందున ఇద్దరిని వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుటలో సందేహము లేదు.
.jpeg)
0 Comments